Tuesday, 27 February 2018

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది. పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట ! తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము? పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా? తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు. పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము. తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు. పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి. తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం ! పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.
Ashok Kumar Bhattacharya

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది

ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

నీవు,నేను ?

శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడే అనడానికి అలానే
పునర్జన్మ సిద్ధాంతం మీద భగవద్గీత నుండి చక్కని శ్లోకం.

నీకు నాకు అనేక జన్మలు గతించాయి  అనడంలో భగవానుడి ఆంతర్యం ఏమిటి??? ఈ జన్మలు నీవు ఎరుగవు నాకు తెలుసు అనడంలో ఆంతర్యం ఏమిటి???

శ్రీమద్భగవద్గీత
నాల్గవ అధ్యాయము
4:5

బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున,
తా న్యహం వేద సర్వాణి‌
న త్వం వేత్థ పరంతప

శ్రీ భగవానుడిట్లు పలికెను:- శత్రువులను తరింపజేయు ఓ అర్జునా! నీకును, నాకును ఇంతవర కనేక జన్మలు గడిచినవి. వాని నన్నిటిని నే నెఱుగుదును. నీ వెఱుగవు.

పూర్తి వివరణ

నీవు,నేను ఇప్పుడు ఉన్నాము. ఇదివరలో లేము అనే మాట సరైనది కాదు. మనము నిత్యులము. నిత్యమైన నా మూల స్వరూపము ఉండనే ఉన్నది. అది కాక.... మత్స్య,కూర్మ,వరాహ,నృసింహ, వామన ఇత్యాది బహురూపాలు నేను పూర్వము స్వీకరించినటువంటి వసుదేవ సుతునిగా నేను ఇటీవల వాడినే అయినను లోగడ వివిధ రూపాల్లో (జన్మలో) పెక్కు మంది పురుషులకు అనేక ఉపదేశాలని ఇచ్చి ఉన్నాను...... ఇది శ్రీకృష్ణుడు తెలిపిన
ఆయన అవతారముల రహస్యము
దీని బట్టీ శ్రీకృష్ణుని మూల రూపము నారాయణుడే అని స్పష్టం ఐనది. కనుక ఈ శ్రీకృష్ణుడే నారాయణ రూపంలో కల్పాది యందు సూర్యునికి ఈ యోగమును ఉపదేశించెను. వసుదేవ సుతునిగా నేడు దీనిని అర్జునుడికి ఉపదేశించెను. ఇందులో కాల వ్యత్యాసం ఉన్నది కానీ వైరుధ్యాలు ఏమి లేవు

ఇందు భగవానుడు తన సర్వజ్ఞత్వమును జీవుల అల్పజ్ఞత్వముని ప్రకటించుచున్నాడు.... అతను ప్రకటించిన లీలలని, ఘటనలని ఇతర విశేషాలను అతను ఎరుగును. సర్వజ్ఞుడు కానందున అర్జునుడు ఎరుగడు. అర్జునుడికి తన పూర్వ జన్మల స్మృతియే లేదు. కనుక అతను ఇలా ప్రశ్నించెను. జగత్తు లో ప్రతీ సంఘటన ఆయనకి (శ్రీకృష్ణుడు కి) తెలియకుండా జరగదు. భూత,భవిష్య,వర్తమాన కాలాలు అన్ని భగవానుడుకి వర్తమానాలే. సర్వజ్ఞుడు అయిన అతను అన్ని ఎరుంగును. కల్పాది యందు నారాయణ రూపము యందు  శ్రీకృష్ణుడు ఉపదేశించైనా విషయాలని అర్జునుడు ఎరుగడు....కానీ భగవానునికి తెలుసు
సుదర్శన చక్రం

గుండెపోటు

చాలామందికి బాత్రూమ్‌లోనే గుండెపోటు ఎందుకొస్తుంది?
మ‌హాన‌టి శ్రీదేవి హ‌ఠాన్మ‌రణానికి కార‌ణ‌మైన గుండెపోటు మరోసారి త్రీవ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుండెపోటు కార‌ణంగానే ఎక్కువ మంది చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. నివురు గ‌ప్పిన నిప్పులాంటి ఈ వ్యాధి ఎటువంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లూ లేకుండానే క‌బ‌లిస్తోంది. ముఖ్యంగా బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న స‌మ‌యంలోనే చాలామంది గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నట్టు వార్త‌లు వింటున్నాం. తాజాగా శ్రీదేవి కూడా బాత్రూమ్‌లోనే గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.
సామాన్యులు కూడా బాత్రూమ్‌లో ఉన్న‌ప్పుడు గుండెపోటుకు గురైన సంద‌ర్భాలు అనేకం. దీనికి గ‌ల కార‌ణం ఏమిటి? యూఐటీమ్ ప్రొఫెస‌ర్ దీనికి స‌మాధానం చెప్పారు. బాత్రూమ్‌లోకి ప్ర‌వేశించగానే స్నానం చేసే ప‌ద్ధ‌తి కూడా గుండెపోటుకు కార‌ణం కావొచ్చ‌ని ఆయ‌న తెలిపారు. ‘‘చాలామంది స్నానం చేసే క్రమంలో ముందుగా త‌మ‌ త‌ల‌ను త‌డుపుకుంటారు. అది త‌ప్పుడు ప‌ద్ధ‌తి. అలా చేయ‌డం వ‌ల్ల వేడి ర‌క్తం గ‌ల‌ మాన‌వ శ‌రీరం ఒక్క‌సారిగా ఉష్ణోగ్ర‌త‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించుకోలేదు. ఉష్ణోగ్ర‌త‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించుకునే క్ర‌మంలో నీళ్లు ప‌డిన త‌ల భాగం వైపున‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ ఒక్క‌సారిగా పెరుగుతుంది. దీంతో ర‌క్త‌నాళాల్లో ఎవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటుకు కార‌ణ‌మ‌వుతాయి. ఈ కార‌ణంగా ఒక్కోసారి ప‌క్ష‌వాతం కూడా రావొచ్చు. అలా కాకుండా స్నానం చేసేట‌పుడు ముందుగా పాదాల నుంచి పైకి నీటిని వేసుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి. ముఖ్యంగా అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్‌, మైగ్రేన్‌తో బాధ‌ప‌డుతున్నవారు స్నానం చేసేట‌పుడు ఈ ప‌ద్థతినే పాటించాలి’’ అని ఆయ‌న సూచించారు.

అతిలోక సుందరి అతే కొంపముంచిందా..?

              ఎప్పటికీ     శ్రీదేవిని మించిన అందాలరాశి తెలుగు ఇండస్ట్రీలోలేదు. అప్పటికే బాలీవుడ్‌కు వెళ్లిపోయి నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యింది. ఇక మెగాస్టార్‌తో నటించిన జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా సూపర్‌హిట్‌ అయ్యేసరికి. ఆ తర్వాత ఆమెకు జాతీయస్థాయిలో గుర్తింపు పెరిగింది

                   ఇక ఆశ్చర్యం అనే పదం ఎందుకు వాడానంటే.. శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో నటించింది. వారితో నటించి వారి నుంచి ఎంతో నేర్చుకొంది..కొత్త నీరు వస్తే పాత నీరు తప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ శ్రీదేవికి ఉన్న అతి జాగ్రత్త ఆమెను జీవితాంతం వేధిస్తూనే ఉంది. సాటి హీరోయిన్ల రాకతో పోటీ పెరిగి అందానికి మెరుగులు దిద్దుకోవడం నేర్చుకుంది.కోటేరు ముక్కు కోసం సర్జరీ, పళ్లు ఎత్తుగా కన్పించకుండా ఉండేందుకు సర్జరీ.. ఇలా ప్రతీదానికి వేరే వాళ్లతో పోటీ పెట్టుకుందా.. తనకు తానే తెలీకుండా ఒక మాయా వలయంలో చిక్కుకుపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతకాలం.. కొత్తగా వచ్చిన ప్రతీ హీరోయిన్‌తో పోటీ కోసం తాపత్రయ పడుతూనే ఉంది. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత కూడా అదే పరిస్థితి. మొదట్లో రేఖ, ఆ తర్వాత జయప్రద, ఆ తర్వాత మాధురీ.. ఇలా ప్రతీ ఒక్కరితో పోటీ పడుతూ అందానికి సర్జరీలు చేయించుకుంటూ ఇబ్బందులు పడుతూనే ఉంది.

                      శ్రీదేవి జీవితానికి, పాప్‌ సింగక్‌ మైఖేల్‌ జాక్సన్‌ జీవితానికిీ చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరూ ఒకే టైప్‌ మెంటాలిటీ ఉన్నవాళ్లు. కాలం, కాలంతో పాటు వచ్చే మార్పుల్ని స్వాగతించలేనివాళ్లు. ముఖంపై చిన్న మడత వస్తే తట్టుకోలేని వీళ్లిద్దరి జీవితాంతం సర్జరీలతో కాలం గడిపారు. స్లిమ్ముగా ఉండడం కోసం అన్నం మానేసి ట్యాబ్లెట్లతోనే కాలం గడిపారు. మైఖెేల్‌ జాక్సన్‌ పోస్ట్‌మార్టమ్‌ చేసిన డాక్టర్‌ రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌లో ఏముందో తెలుసా... ఆయన కడుపులో సరిగ్గా అరిగీ అరగని విటమిన్‌ ట్యాబ్లెట్లు చాలా ఉన్నాయని.
ఏదో సాధించాలని అతి తపన, ఆ తపనలో సరిగ్గా తిన్నామా, పడుకున్నామా అని పట్టించుకోకుండా పరుగుపెట్టాడు.
చివరకు ఓ రోజు రాత్రి గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు శ్రీదేవి కూడా అంతే.

                      రీసెంట్‌గా వారం రోజుల క్రితం ఓ ఫంకన్‌కు వచ్చింది. అందులో ఆమెను చూసిన వాళ్లంతా షాక్‌ అయ్యారు
చాలా సన్నగా, పీలగా ఉంది. అలా ఉండడాన్ని ఆమె అందం అనుకుంది. చూసినవాళ్లు ఈమెకు ఏదో జరుగుతుంది అనుకున్నారు.
అలా మనసులో అనుకున్నది మర్చిపోయేలోపే.. మన అందర్ని మర్చిపోయి ఆమె వెళ్లిపోయింది. రామ్‌గోపాల్‌ వర్మ చెప్పినట్లు... శ్రీదేవి అందం అనే వెలుగుని చాలామంది కళ్లల్లో, గుండెల్లోంచి ఆర్పేసి మరీ పట్టుకుపోయాడు దేవుడు.

               మనిషికి అందం చాలా అవసరం. కానీ అందమే జీవితం కాదు. అందంతో పాటు ఆనందం అనేది ఒకటి ఉంటుందని చాలామంది మర్చిపోతున్నారు. అందులో శ్రీదేవి కూడా ఒకరు. శ్రీదేవి కంటే ముందు బాలీవుడ్‌కి వచ్చిన రేఖ ఇప్పటికీ ఎంతో చలాకీగా ఉంటారు.
ఆమె ముఖంపై ముడుతలు ఉంటాయి. ఫేస్‌లో గ్లో తగ్గింది. కానీ వాటన్నింటిని ఆమె తన నవ్వుతో జయిస్తారు. కానీ శ్రీదేవి అలా జయించలేకపోయింది. ఇంకా చిన్నపిల్లలానే కన్పించాలని ఆత్యాశ, ఆతృతతో తన వయసుని, వయసుతో వచ్చే మార్పుల్ని ఆహ్వానించలేకపోయింది. ఫలితం... అతిలోక సౌందర్యం... ఓ అర్థరాత్రి... అనంతలోకాలకు..వెడలిపోయింది.

గుండె పోటు.
దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.
1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).
2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.
3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది
ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.
మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4) దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.
5) మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6) మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.
వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.
7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు.
దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.
ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.
8) గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.
బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.
9) ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.
10) ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.
11) జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి
తెలియజేయండి.
12 ) ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.
మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది
మీ కోసం ఈ సందేశం పంపిన వారు.
డా. ఎం .అశోక్
Cardiology Doctor

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...